ట్రంప్ పేరును మర్చిపోయిన జో బైడెన్.. ఏమని పిలిచారంటే..

ABN , First Publish Date - 2020-10-28T05:20:26+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో డెమొక్రటిక్ పార్టీ తరపున

ట్రంప్ పేరును మర్చిపోయిన జో బైడెన్.. ఏమని పిలిచారంటే..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును మర్చిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న జో బైడెన్.. ట్రంప్‌ను ‘జార్జ్’ అంటూ సంభోధించారు. ‘మరో నాలుగేళ్ల పాటు జార్జ్ అధ్యక్షుడిగా ఉంటే.. అమెరికా అస్తవ్యస్థం అయిపోతుంది’ అని ఆయన వర్చువల్ కార్యక్రమంలో తెలిపారు. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన పేరునే జో బైడెన్ గుర్తుపెట్టుకుని ఈ విధంగా సంభోధించినట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని జో బైడెన్ ట్రంప్ పేరును మర్చిపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


మరోపక్క ఈ ఘటనపై ట్రంప్ కూడా స్పందించారు. ‘జో బైడెన్ నిన్న నన్ను జార్జ్ అని పిలిచారు. ఆయన నా పేరును కూడా గుర్తుపెట్టుకోలేదు’ అని ట్వీట్ చేశారు. జో బైడెన్ అధ్యక్ష పదవికి అనర్హుడని.. మానసికంగా ఆయన పరిస్థితి బాగోలేదని ఆరోపించారు. గతంలోనూ ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేశారు. కాగా.. జో బైడెన్ వయసు 77 ఏళ్లు. ఒకవేళ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే అధ్యక్ష పదవి చేపట్టిన అతిపెద్ద వయస్కుడిగా ఆయన రికార్డు కొడతారు.

Updated Date - 2020-10-28T05:20:26+05:30 IST