గత ఏడాది చివరి నాటికే.. ఇటలీలో కరోనా..!
ABN , First Publish Date - 2020-06-19T23:21:33+05:30 IST
ఇటలీలో గత సంవత్సరం డిసెంబర్ నాటికే కరోనా వైరస్ మూలాలు ఉన్నట్లు తాజాగా పరిశోధకులు గుర్తించారు. గత సంవత్సరం చివరిలో ఇటలీలోని మిలాన్, టురిన్ ప్రాం
![గత ఏడాది చివరి నాటికే.. ఇటలీలో కరోనా..!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020061905484545/06192020175122n3.jpg)
రోమ్: ఇటలీలో గత సంవత్సరం డిసెంబర్ నాటికే కరోనా వైరస్ మూలాలు ఉన్నట్లు తాజాగా పరిశోధకులు గుర్తించారు. గత సంవత్సరం చివరిలో ఇటలీలోని మిలాన్, టురిన్ ప్రాంతాల్లో సేకరించిన వ్యర్థ జలలాను పరీక్షించగా.. అందులో కరోనా వైరస్కు సంబంధించిన జన్యు జాడలు లభించాయని పరిశోధకలు వివరించారు. ఇదిలా ఉంటే.. ఇటలీలో కరోనా వైరస్ మొదటి కేసు ఫిబ్రవరిలో నమోదైంది. అనంతరం మహమ్మారి విజృంభించడంతో.. ఇటలీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది. ఇప్పటి వరకు ఇటలీలో 2.38లక్షల మంది కరోనా కేసులు నమోదవ్వగా.. సుమారు 34వేల మంది మహమ్మారికి బలయ్యారు. కాగా.. యూరప్ దేశాల్లో కరోనా బారినపడ్డ మొదటి దేశం ఇటలీ. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటగా దేశవ్యాప్త లాక్డౌన్ను అమలు చేసిన దేశం కూడా ఇటలీనే.