అమెరికాలో 2.5 లక్షలు దాటిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-11-19T13:58:27+05:30 IST

అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 2.5 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి

అమెరికాలో 2.5 లక్షలు దాటిన కరోనా మరణాలు

వాషింగ్టన్: అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 2.5 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం బుధవారం వరకు అమెరికాలో 2,50,029 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. మరోపక్క అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 1,15,17,455 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. నిత్యం లక్షా 50 వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. చలికాలం కావడంతో మహమ్మారి మరింత వ్యాప్తి చెందుతూ పోతోంది. ట్రంప్ ప్రభుత్వం మాత్రం కరోనాను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో న్యూయార్క్ సిటీలో స్కూళ్లను మళ్లీ మూసివేశారు. బార్లు, రెస్టారెంట్లపై మరోమారు ఆంక్షలు విధించారు. మరోపక్క కరోనా ఈ విధంగా వ్యాప్తి చెందుతున్నా చాలా రాష్ట్రాల్లో ప్రజలు కనీసం ఫేస్‌మాస్క్ కూడా ధరించడం లేదు. ప్రజలందరూ ఫేస్‌మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలకు సూచిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం విధితమే. అమెరికా తరువాత అత్యధిక మరణాలు బ్రెజిల్(1,66,699), భారత్ (1,30,993), మెక్సికో(99,026) దేశాల్లో నమోదయ్యాయి.

Updated Date - 2020-11-19T13:58:27+05:30 IST