భారత్ వాయు కాలుష్యంపై ట్రంప్ వ్యాఖ్యలకు బిడెన్ కౌంటర్

ABN , First Publish Date - 2020-10-25T16:35:16+05:30 IST

అమెరికా చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో భారత్ వాయు కాలుష్యంపై అధ్యక్షుడు ట్రంప్ విమర్శిస్తూ 'భారత్‌లో చెత్త ఎక్కువ, అక్కడి గాలి చాలా చెత్తగా ఉంటుంది' అని అన్నారు. దీనిపై తాజాగా ఆయన ప్రత్యర్థి జో బిడెన్ ఆయనను తప్పుబట్టారు.

భారత్ వాయు కాలుష్యంపై ట్రంప్ వ్యాఖ్యలకు బిడెన్ కౌంటర్

అమెరికా చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో భారత్ వాయు కాలుష్యంపై అధ్యక్షుడు ట్రంప్ విమర్శిస్తూ 'భారత్‌లో చెత్త ఎక్కువ, అక్కడి గాలి చాలా చెత్తగా ఉంటుంది' అని అన్నారు. దీనిపై తాజాగా ఆయన ప్రత్యర్థి జో బిడెన్ ఆయనను తప్పుబట్టారు. "భారత్‌లాంటి మిత్ర దేశాలను అలాంటి పదజాలం (చెత్త)తో దూషించడం సరికాదు. ప్రపంచ వాతావరణ కాలుష్యానికి సమాధానం వెతకాల్సిన బాధ్యత అందరిపై ఉంది, ఇలాంటి వ్యాఖ్యలతో ఇతరులను దూషించడం వల్ల ఉపయోగం లేదు. నేను, కమలా హారిస్ అమెరికా మిత్ర దేశాలను మన విదేశాంగ నీతితో ఎంతో గౌరివిస్తాం" అని బిడెన్ చెప్పారు.

Updated Date - 2020-10-25T16:35:16+05:30 IST