భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదలుకానున్న విమాన సేవలు
ABN , First Publish Date - 2020-10-18T07:22:09+05:30 IST
బంగ్లాదేశ్, భారత ప్రభుత్వం మధ్య ‘ఎయిర్ బబూల్’ ఒప్పందం కుదరడంతో అక్టోబర్ 28 నుంచి ఇరు దేశాల మధ్య విమాన
ధాకా: బంగ్లాదేశ్, భారత ప్రభుత్వం మధ్య ‘ఎయిర్ బబూల్’ ఒప్పందం కుదరడంతో అక్టోబర్ 28 నుంచి ఇరు దేశాల మధ్య విమాన సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు ఎనిమిది నెలల క్రితం ఇరు దేశాల మధ్య విమాన సేవలు ఆగిపోయాయి. ఇక తాజా ఒప్పందం కింద బంగ్లాదేశ్కు చెందిన బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్, యూఎస్-బంగ్లా ఎయిర్లైన్స్, నోవో ఎయిర్ భారత్కు విమానాలను నడపనుంది. మరోపక్క భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్ బంగ్లాదేశ్కు విమాన సేవలను అందించనుంది. కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి నెలలో అన్ని రకాల విమాన సేవలపై ఆంక్షలు విధించింది. కొద్ది నెలల క్రితం డొమెస్టిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి.. అంతర్జాతీయ సేవలపై ఆంక్షలను కొనసాగిస్తోంది. జూలై నుంచి ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకున్న దేశాలకు విమానాలను తిప్పుతోంది.