2 నెలల్లో 16 వేల మంది ప్రవాసుల రాక: ఏపీఎన్నార్టీఎస్
ABN , First Publish Date - 2020-07-19T14:39:24+05:30 IST
వందేభారత్ మిషన్లో భాగంగా రాష్ట్రానికి గత 2నెలల్లో 16వేల మంది ప్రవాసులు ప్రత్యేక విమానాల్లో వచ్చినట్లు ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి ఎస్.వెంకట్ తెలిపారు.

వందేభారత్ మిషన్ కింద ఏపీఎన్నార్టీ కీలకపాత్ర
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): వందేభారత్ మిషన్లో భాగంగా రాష్ట్రానికి గత 2నెలల్లో 16వేల మంది ప్రవాసులు ప్రత్యేక విమానాల్లో వచ్చినట్లు ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి ఎస్.వెంకట్ తెలిపారు. విదేశాల్లో ఇరుక్కుపోయిన ప్రవాసులను తీసుకొచ్చేందుకు ఏపీఎన్నార్టీఎస్ కీలకపాత్ర పోషించిందన్నారు. వారిని క్వారంటైన్లోకి తీసుకెళ్లేందుకు, సదుపాయాలు కల్పించేందుకు తమ బృందాలు పనిచేశాయన్నారు.