ఫేస్మాస్క్లు దొంగిలించిన ఆరుగురికి మూడేళ్ల జైలుశిక్ష.. దుబాయిలో..
ABN , First Publish Date - 2020-11-21T15:21:20+05:30 IST
ఫేస్మాస్క్లు దొంగిలించిన కేసులో ఆరుగురు పాకిస్థానీలకు దుబాయి కోర్టు మూడేళ్ల జైలుశిక్షను విధించింది. జూన్ 18న జరిగిన

దుబాయి: ఫేస్మాస్క్లు దొంగిలించిన కేసులో ఆరుగురు పాకిస్థానీలకు దుబాయి కోర్టు మూడేళ్ల జైలుశిక్షను విధించింది. జూన్ 18న జరిగిన ఈ ఘటనకు తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దుబాయిలో నివసిస్తున్న ఆరుగురు పాకిస్థానీలు ఓ వేర్హౌస్లోకి అక్రమంగా ప్రవేశించి 1.5 లక్షల దిర్హామ్లు(రూ. 30.28 లక్షలు) విలువ చేసే 156 బాక్సుల ఫేస్మాస్క్లను దొంగిలించారు. అదే వేర్హౌస్లో పనిచేస్తున్న చైనాకు చెందిన ఉద్యోగి దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆరుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. తాము దొంగిలించిన మాస్క్లను బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు నిందితులకు నేరాన్ని అంగీకరించారు. నిందితులు ఇదే కాకుండా ఇతర దొంగతనాలకు కూడా పాల్పడినట్టు అధికారులు తెలుసుకున్నారు. జూన్ నుంచి ఈ కేసు విచారణ కోర్టులో జరుగుతూ రాగా.. తాజాగా కోర్టు నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అంతేకాకుండా 1.5 దిర్హామ్ల జరిమానాను కూడా చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. మూడేళ్ల జైలు జీవితం అనుభవించిన తర్వాత వీరందరిని దేశం నుంచి బహిష్కరించనున్నట్టు కోర్టు చెప్పింది.