నైజీరియాలో అపహరణకు గురైన 344 మంది విద్యార్థుల విడుదల
ABN , First Publish Date - 2020-12-19T13:05:54+05:30 IST
వాయువ్య నైజీరియాలో సాయుధ వ్యక్తులు గత వారం అపహరించుకువెళ్లిన 344 మంది పాఠశాల విద్యార్థులను విడిచిపెట్టినట్లు కత్సినా రాష్ట్ర గవర్నర్ అమిను బెల్లో మసారి చెప్పారు.

మైదుగురి(నైజీరియా), డిసెంబరు 18: వాయువ్య నైజీరియాలో సాయుధ వ్యక్తులు గత వారం అపహరించుకువెళ్లిన 344 మంది పాఠశాల విద్యార్థులను విడిచిపెట్టినట్లు కత్సినా రాష్ట్ర గవర్నర్ అమిను బెల్లో మసారి చెప్పారు. విద్యార్థులను భద్రతా అధికారులకు అప్పగించినట్లు నైజీరియన్ టీవీలో గురువారం ప్రకటించారు. కాన్కరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలపై జిహాదీ గ్రూప్ గత శుక్రవారం దాడి చేసి, విద్యార్థులను అపహరించుకుపోయింది.