అమెరికా నౌకలో ముగ్గురు నావికులకు కరోనా..!

ABN , First Publish Date - 2020-03-26T05:23:10+05:30 IST

అమెరికాకు చెందిన యూఎస్ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ నౌకలో ముగ్గురు నావికులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం అధికారులు వెల్లడించారు.

అమెరికా నౌకలో ముగ్గురు నావికులకు కరోనా..!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన యూఎస్ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ నౌకలో ముగ్గురు నావికులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం అధికారులు వెల్లడించారు. ఈ నౌకలో మొత్తంగా 5 వేలకు పైగా సిబ్బంది ఉన్నట్టు యాక్టింగ్ నేవీ సెక్రటరీ థామస్ బీ. మాడ్లీ తెలిపారు. కరోనా సోకిన ముగ్గురు నావికులు ఎవరెవరితో మాట్లాడారో.. వారందరిని క్వారంటైన్‌కు తరలించినట్టు థామస్ పేర్కొన్నారు. కాగా.. ఈ నౌక 15 రోజుల క్రితం చివరగా వియత్నాం పోర్ట్‌లో ఆగినట్టు నేవల్ ఆపరేషన్స్ అడ్మైరల్ చీఫ్ మైక్ గిల్డే తెలిపారు. అయితే వైరస్ ఏ పోర్ట్‌లో ఆగినప్పుడు సోకిందో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. వియత్నాం పోర్టు సందర్శన సమయంలో తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, పోర్టు నుంచి వచ్చిన నావికులకు మెడికల్ పరీక్షలు కూడా నిర్వహించామని మైక్ చెప్పారు. కాగా.. ఇప్పటివరకు అమెరికా నేవీలో మొత్తంగా 86 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం శాండియాగో పోర్ట్‌లో ఉన్న యూఎస్‌ఎస్ బాక్సర్ నౌకలో గత వారం ఒక నావికుడికి కరోనా సోకినట్టు అమెరికా మీడియా వెల్లడించింది.


Updated Date - 2020-03-26T05:23:10+05:30 IST