కరోనా ఎఫెక్ట్.. కువైత్ వీడిన 1.58లక్షల మంది..!
ABN , First Publish Date - 2020-07-11T02:19:38+05:30 IST
కరోనా మమమ్మారి ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న వారు స్వదేశానికి తరలి వెళ్తున్నారు. కరోనా కారణంగా

కువైత్: కరోనా మమమ్మారి ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న వారు స్వదేశానికి తరలి వెళ్తున్నారు. కరోనా కారణంగా దాదాపు 1.58లక్షల మంది ప్రవాసులు.. కువైత్ నుంచి తరలివెళ్లినట్లు స్థానిక పత్రిక పేర్కొంది. కువైత్ జనాభా 4.8 మిలియన్లు ఉండగా.. అందులో విదేశీయుల సంఖ్య 3.4 మిలియన్లు అని ఆ పత్రిక వెల్లడించింది. కాగా.. కువైత్ను వదిలి వెళ్లే విదేశీయుల సంఖ్య ఈ ఏడాది చివరి 1.5మిలియన్లకు చేరుకుంటుందని సదరు వార్తా పత్రిక అంచనా వేసింది. కరోనా కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడం వల్లే లక్షలాదిమంది విదేశీయులు కువైత్ను వీడుతున్నట్లు ఆ పత్రిక స్పష్టం చేసింది. కాగా.. కువైత్లో ఇప్పటి వరకు 53వేల మందిపైగా కరోనా బారినపడగా.. మరణించిన వారి సంఖ్య 383కు చేరింది.