కరోనా దేవికి మొక్కులు!
ABN , First Publish Date - 2020-07-06T05:30:00+05:30 IST
కొన్ని నమ్మకాలు విచిత్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్ను అమ్మవారి అంశగా భావించి పూజలు చేయడం ఆశ్చర్యపరుస్తోంది...
కొన్ని నమ్మకాలు విచిత్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్ను అమ్మవారి అంశగా భావించి పూజలు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు కరోనా దేవి శాంతించాలని పూజలు జరుపుతున్నారు. గౌహతి లాంటి కొన్ని ప్రాంతాల్లో మహిళలంతా చేరి సామూహిక పూజలు జరుపుతున్నారు. కరోనా దేవి శాంతించితేనే భూమి మీద నుంచి అదృశ్యమవుతుందని మొక్కులు మొక్కుతున్నారు. నది ఒడ్డున కరోనా దేవికి పూజలు జరిపితే, కరోనా దేవి కరోనా వైర్సను చంపుతుందని చె పుతున్నారు. ఇప్పుడు ఈ పూజలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ‘ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దు, మాస్క్లు ధరించి, సామాజిక దూరం పాటించాలి’ అని ప్రజలకు చెపుతోంది.