ప్రజల నుంచి అపూర్వస్పందన: విజయారెడ్డి
ABN , First Publish Date - 2020-11-26T16:27:50+05:30 IST
ఖైరతాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
![ప్రజల నుంచి అపూర్వస్పందన: విజయారెడ్డి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020112610243565/11262020105653n30.jpg)
హైదరాబాద్: ఖైరతాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పీజేఆర్ వారసురాలిగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న తననే ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నానని, వారి సమస్యలను పరిష్కరించానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల నాడి తెలిసిన నాయకుడని.. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఆమె కొనియాడారు. గురువారం ఉదయం గాంధీనగర్ నుంచి ఏజీ క్వార్టర్స్, ఇందిరానగర్, రహ్మత్నగర్లో పర్యటించానని.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని విజయారెడ్డి తెలిపారు.