ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ వైఖరి: ఎల్.రమణ
ABN , First Publish Date - 2020-12-05T21:30:57+05:30 IST
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ వైఖరి ఉందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు

హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ వైఖరి ఉందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ సీట్లు సగానికి సగం పడిపోయాయన్నారు. నియంతృత్వ పాలనకు గ్రేటర్ ఫలితం ఓ గుణపాఠం అని వ్యాఖ్యానించారు. టీడీపీ శ్రేణులు ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారని చెప్పారు. టీడీపీకి ఓటు వేసిన వారందరికీ ఎల్.రమణ కృతజ్ఞతలు తెలిపారు.