అయ్యో... ఆయన వేసిన రెండు సెట్లూ తిరస్కరించారు..
ABN , First Publish Date - 2020-11-22T15:16:15+05:30 IST
రాజేంద్రనగర్ సర్కిల్లో నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో రెండు ఒక్క అభ్యర్థివే. మైలార్దేవ్పల్లి డివిజన్ నుంచి జి.సౌడయ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 2016లో కూడా ఆయన మైలార్దేవ్పల్లి డివిజన్ నుంచి టీడీపీ
హైదరాబాద్ : రాజేంద్రనగర్ సర్కిల్లో నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో రెండు ఒక్క అభ్యర్థివే. మైలార్దేవ్పల్లి డివిజన్ నుంచి జి.సౌడయ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 2016లో కూడా ఆయన మైలార్దేవ్పల్లి డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించలేదు. దీంతో ఆయన ఇప్పుడు వేసిన రెండు నామినేషన్లూ తిరస్కరణకు గురయ్యాయి.