మందకొడిగా సాగుతున్న గ్రేటర్ పోలింగ్

ABN , First Publish Date - 2020-12-01T19:25:58+05:30 IST

గ్రేటర్ ఎన్నికల్లో మందకొడిగా పోలింగ్ జరుగుతోంది.

మందకొడిగా సాగుతున్న గ్రేటర్ పోలింగ్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. మధ్యాహ్నం అయినా పట్టుమని 20 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు. ఎవరెవరెన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా.. ఓటర్లు మాత్రం పోలింగ్ బూత్‌లపై కన్నెత్తిచూడడంలేదు. సోషల్ మీడియాలో లెక్చరర్లు దంచే ఐటీ ప్రొఫెనల్స్ సయితం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక సెలబ్రెటిల్లో కూడా కొందరే కనిపించారు. అటు సామాన్యుల సంగతె చెప్పనక్కర్లేదు. విద్యాధికులు, కార్పొరేట్ ఉద్యోగులు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. హాలీడేను ఎంజాయ్ చేస్తున్నట్టుగా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటింగ్ పెద్దగా నమోదు కాకపోవడంపై విజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమేనంటున్నారు. ఓటు వేయనివాళ్లపై సామాన్యుడు కన్నెర్రజేస్తున్నాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఓటు వేయనివారికి ప్రభుత్వ, సంక్షేమ పథకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశాడు.

Updated Date - 2020-12-01T19:25:58+05:30 IST