ఆర్టీసీ ఎండీకి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సమ్మె నోటీసు

ABN , First Publish Date - 2020-11-13T09:17:06+05:30 IST

ఆర్టీసీ ఎండీకి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సమ్మె నోటీసు

ఆర్టీసీ ఎండీకి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సమ్మె నోటీసు

విజయవాడ బస్‌స్టేషన్‌, నవంబరు 12: దేశవ్యాప్తంగా నవంబరు 26న జరగనున్న సమ్మెలో పాల్గొనాలని ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులు నిర్ణయించారు. గురువారం బస్‌స్టేషన్‌ ఆవరణలో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును ఆయన చాంబర్‌లో కలిసిన ఆర్టీసీ ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కమిటీనాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ఎస్‌డబ్ల్యుఎ్‌ఫతో పాటు మరో నాలుగు సంఘాలు, అసోసియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కే జిలాని భాష, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.సుందరరావు కృష్ణబాబుకు తెలిపారు. 

Updated Date - 2020-11-13T09:17:06+05:30 IST