నిరుద్యోగ భృతి కోసం క్లెయిమ్ చేసుకోండి
ABN , First Publish Date - 2020-09-18T16:24:50+05:30 IST
కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎ్సఐసీ) సభ్యులు అటల్ బిమిత్ కళ్యాణ్ యోజనా కింద

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎ్సఐసీ) సభ్యులు అటల్ బిమిత్ కళ్యాణ్ యోజనా కింద వేతనాల్లో 50 శాతం నిరుద్యోగ భృతిని పొందడానికి క్లెయిమ్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. అఫిడవిట్, ఆధార్కార్డు తదితర వివరాలతో కూడిన ఫొటో కాపీని ఈఎ్సఐసీ కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా పంపవచ్చని పేర్కొంది.