ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలి: టీపీయూఎస్
ABN , First Publish Date - 2020-07-19T22:23:35+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్లు అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం

హైదరాబాద్, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్లు అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం ప్రమాదకరంగా ఉన్నందున ఆన్లైన్ విద్యాబోధన మాత్రమే ప్రత్యామ్నాయమని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేష్ తెలిపారు. ట్యాబ్లతో ఆన్లైన్ విద్యాబోధన సజావుగా సాగుతుందని ప్రభుత్వనికి వారు సూచించారు.