గురుకులాల్లో సైకాలజిస్టులను నియమించాలి
ABN , First Publish Date - 2020-12-25T17:52:56+05:30 IST
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సైకాలజిస్టులను నియమించాల్సి
![గురుకులాల్లో సైకాలజిస్టులను నియమించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మంత్రికి సైకాలజిస్టుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సైకాలజిస్టులను నియమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాంచందర్, ఎ.సుధాకర్, బి.అరుణ్కుమార్, వై.శివరామప్రసాద్, దేదీప్య తదితరులు గురువారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు వినతిపత్రం సమర్పించారు.