ఈ ఏడాది జాతీయ పుస్తక ప్రదర్శన లేదు

ABN , First Publish Date - 2020-12-15T16:08:50+05:30 IST

ప్రతి ఏడాది హైదరాబాద్‌లో డిసెంబరులో నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనను ఈ సారి నిర్వహించలేకపోతున్నట్లు

ఈ ఏడాది జాతీయ పుస్తక ప్రదర్శన లేదు

బుక్‌ఫెయిర్‌ సొసైటీ ప్రకటన

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏడాది హైదరాబాద్‌లో డిసెంబరులో నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనను ఈ సారి నిర్వహించలేకపోతున్నట్లు బుక్‌ఫెయిర్‌ సొసైటీ నిర్వాహకులు ప్రకటించారు. అందుకు కరోనా పరిస్థితులే కారణమని ఆ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తెలిపారు.


కరోనా వ్యాప్తి తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒకవేళ కరోనా తగ్గితే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో బుక్‌ఫెయిర్‌ నిర్వహించవచ్చని సమాచారం. చిక్కడపల్లి, సిటీసెంబ్రల్‌ లైబ్రరీ వేదికగా 1985లో తొలిసారిగా హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది.  


Updated Date - 2020-12-15T16:08:50+05:30 IST