పరీక్షలా.. ఇంటర్నల్ మార్కులా?
ABN , First Publish Date - 2020-06-16T16:54:15+05:30 IST
కరోనాతో గత మార్చిలో వాయిదా పడిన 10, 12 తరగతుల వార్షిక పరీక్షల విషయంలో ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐఎస్సీఈ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఐఎస్సీఈ 10, 12 తరగతుల విద్యార్థులదే నిర్ణయం
ముంబై, జూన్ 15 : కరోనాతో గత మార్చిలో వాయిదా పడిన 10, 12 తరగతుల వార్షిక పరీక్షల విషయంలో ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐఎస్సీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా పడిన సబ్జెక్ట్లకు వచ్చే నెలలో నిర్వహించే పరీక్షలకు హాజరు కావాలా లేకుంటే అంతర్గత మూల్యాంకనం (ఇంటర్నల్ అసె్సమెంట్) ఆధారంగా తుది ఫలితాన్ని వెల్లడించాలా అనే విషయాన్ని విద్యార్థులకే వదిలి వేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టుకు ఐఎ్ససీఈ ఒక నోట్ను సమర్పించింది.