ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు ‘ఎంట్రన్స్’
ABN , First Publish Date - 2020-10-21T15:17:59+05:30 IST
2020-21 విద్యా సంవత్సరానికి ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల విధానం మారనుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికిగాను

అమరావతి: 2020-21 విద్యా సంవత్సరానికి ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల విధానం మారనుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికిగాను ఆర్జీయూకేటీ చట్టంలోని సెక్షన్ 13(4)లో మార్పులు చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ను పదో తరగతి సిలబస్ మేరకే నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీశ్చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.