పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు : మంత్రి సురేశ్
ABN , First Publish Date - 2020-12-10T16:02:16+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేపీ పెరుగుతోంది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇది 40-50 శాతం మధ్య ఉండగా క్రమేణా 60 శాతానికి చేరుకుంటోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేపీ పెరుగుతోంది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇది 40-50 శాతం మధ్య ఉండగా క్రమేణా 60 శాతానికి చేరుకుంటోంది. రోజూ 50శాతానికి తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం తెలిపారు. ఈ నెల 14 తర్వాత 6,7 తరగతులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.