గురుకుల విద్యార్థులకు డిజిటల్ తరగతులు
ABN , First Publish Date - 2020-09-01T14:50:04+05:30 IST
గిరిజన పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్.. అధికారులను ఆదేశించారు.

ఆన్లైన్ పాఠాలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): గిరిజన పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్.. అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె గిరిజన అభివృద్ధి శాఖ కమిషనర్ క్రిస్టినా, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులను స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టా్పలు, కంప్యూటర్లు ఉన్నవారిని ఒక గ్రూపుగా, టీ-సాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులను ఇంకో గ్రూపుగా గుర్తించాలన్నారు.