‘మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2020-01-18T16:23:12+05:30 IST

గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలని, గతంలో ఉన్న కేటగిరీలను యథాతథంగా కొనసాగించాలని, పంచాయతీ ఉద్యోగులు,

‘మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలి’

పంచాయతీ ఎంప్లాయిస్‌, వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
 
హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలని, గతంలో ఉన్న కేటగిరీలను యథాతథంగా కొనసాగించాలని, పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు రూ. 8500 వేతనాన్ని సెప్టెంబరు నుంచే అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్‌, అధ్యక్షుడు గణపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్యల ఆధ్వర్యంలో పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు శుక్రవారం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
 

Updated Date - 2020-01-18T16:23:12+05:30 IST