ABN
, First Publish Date - 2020-01-01T12:47:25+05:30 IST
జేఈఈ మెయిన్ పరీక్షలు వాయిదా?
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జనవరి 6 నుంచి 9 వరకు నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. అన్ని కార్మిక సంఘాలు జనవరి 8న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో సమ్మె రోజు నిర్వహించే పరీక్షలను వాయిదా వేయాలని కార్మిక సంఘం సీఐటీయూ.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాసింది.