ఈ వారం వివిధా కార్యక్రమాలు
ABN , First Publish Date - 2020-02-24T07:09:32+05:30 IST
ధనికొండ కథలపై చర్చా సమావేశం పుస్తకావిష్కరణ ‘దక్షిణాయనం’ కవితా సంపుటి విరసం సదస్సు కొలకలూరి పురస్కారాలు 2020 మధునాపంతుల శతజయంతి సదస్సు ‘మాలపల్లె కథలు’ ‘ఆదిధ్వని’ గిరిజన జానపద సంగీత ఉత్సవాలు...
ధనికొండ కథలపై చర్చా సమావేశం
ధనికొండ హనుమంతరావు శతజయంతి ముగింపు సమావేశాల్లో భాగంగా ఆయన కథలమీద మార్చి 1 ఉ.10గం.లనుంచి సా.5గం.లదాక రవీంద్రభారతి మినీ హాల్లో చర్చా సమావేశం జరుగుతుంది. ఇందులో ఆయన రచనా కాలపు నేపథ్యం గురించి వకుళా భరణం రామకృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్, కె. శ్రీనివాస్, ఆయన కథల గురించి కాత్యాయని విద్మహే, నవ్య సంపాదకులు జగన్నాథ శర్మ మాట్లాడతారు. ఎంపిక చేసిన 40కథల మీద 25మందికి పైగా యువ రచయి తలు, విమర్శకులు, సాహిత్య అభిమానులు చర్చిస్తారు.
ధనికొండ శతజయంతి సంఘం
పుస్తకావిష్కరణ
కనప నరేందర్ రాసిన పలుపుస్తకాల ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 24 ఉ.10.30కు నిజాం కళాశాల ఆడిటో రియం, బషీర్బాగ్, హైదరాబాద్లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, సి.హెచ్. గోపాలరెడ్డి, ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్ తదితరులు పాల్గొంటారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ