ఆహార సమృద్ధిలో ఆకలి రాజ్యం!
ABN , First Publish Date - 2020-04-25T06:00:20+05:30 IST
లాక్డౌన్ అమల్లో ఉన్నంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తప్పనిసరిగా రెండు ఉపకారాలు చేసితీరాలి. అవి: ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల నుంచి బియ్యం/ గోధుమలు, పప్పు ధాన్యాలు, వంట నూనె, ఉప్పు, చక్కెర మొదలైనవి కొనుగోలు...

లాక్డౌన్ అమల్లో ఉన్నంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తప్పనిసరిగా రెండు ఉపకారాలు చేసితీరాలి. అవి: ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల నుంచి బియ్యం/ గోధుమలు, పప్పు ధాన్యాలు, వంట నూనె, ఉప్పు, చక్కెర మొదలైనవి కొనుగోలు చేసుకునేందుకుపేద కుటుంబాలకు నగదు సమకూర్చాలి. రెండోది, 13 కోట్ల కుటుంబాలకు తిండిగింజలు, పప్పులు, నూనె మొదలైనవి సముచితరీతిలో ఉచితంగా ఇవ్వాలి. నిజానికి ఈ రెండు ఉపకారాలలో ఏదో ఒకటి గాక రెండూ చేయడం అన్ని విధాల శ్రేయస్కరం. చేయాలికూడా. ఎందుకంటే పేద భారతీయులకు ఈ దేశం చాలా రుణపడివున్నది.
వినియోగదారుల వ్యవహరాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించిన వాస్తవాలు: ‘2020 ఏప్రిల్ 20 నాటికి భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో 524.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. ఈ నిల్వల్లో బియ్యం 289.5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా గోధుమలు 235 లక్షల మెట్రిక్ టన్నులు. వీటితో పాటు 287 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల నిల్వలు కూడా వున్నాయి’.
పి. చిదంబరం
