‘వలస భారతం’లో విభిన్న కోణాలు
ABN , First Publish Date - 2020-06-18T05:58:46+05:30 IST
బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, కొంతవరకు ఈశాన్య రాష్ట్రాలు కూడా వలస కార్మికులను సరఫరా చేసే కేంద్రాలుగా మిగిలిపోయాయి. ఈ వలస కూలీలను ఎక్కువగా ఆకర్షిస్తున్నవి మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు...

బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, కొంతవరకు ఈశాన్య రాష్ట్రాలు కూడా వలస కార్మికులను సరఫరా చేసే కేంద్రాలుగా మిగిలిపోయాయి. ఈ వలస కూలీలను ఎక్కువగా ఆకర్షిస్తున్నవి మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు రాజధాని ఢిల్లీ మహాపాలిత ప్రాంతం కూడా. ముంబయి మహానగరంలోనే వలస కార్మికులలో కనిపించే ట్రెండ్ ఏమిటంటే, వలసపోయిన బెంగాలీలు/బంగ్లాదేశీయులు ధనిక కాలనీల్లో తమ పేర్లు మార్చుకుని పనిమనుషులుగా, తోటమాలీలుగా పని చేస్తూంటారు. గుజరాతీయులు, రాజస్థానీయులు ఎక్కువగా వెజిటేరియన్ అవడం వలన వారి ఇండ్లలో వీరు తమ అసలైన పేర్లు చెబితే ముస్లింలు కాబట్టి ఉపాధి దొరకదు. అందువలన హిందూ పేర్లను చెప్పుకుంటారు.