కరోనాతో గేమ్స్ వద్దు!

ABN , First Publish Date - 2020-11-21T05:46:48+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినట్టు కన్పిస్తున్నా, ముప్పు పొంచే ఉంది. ఈ నెలలో తగ్గుతూ వచ్చిన తీవ్రతను చూసి గండం గడిచింది అనుకుంటే పొరపాటే. కరోనా టీకా పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకూ....

కరోనాతో గేమ్స్ వద్దు!

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినట్టు కన్పిస్తున్నా, ముప్పు పొంచే ఉంది. ఈ నెలలో తగ్గుతూ వచ్చిన తీవ్రతను చూసి గండం గడిచింది అనుకుంటే పొరపాటే. కరోనా టీకా పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. తేలిగ్గా తీసుకుంటే ఎంత ప్రమాదమో ఢిల్లీ అనుభవం తెలియజేస్తోంది. గత నెల వరకూ అక్కడ కేసులు తగ్గుతూ వచ్చాయి. ప్రజల్లో కరోనా జాగ్రత్తల పట్ల కొంత ఉదాసీనత వచ్చింది. ఎప్పటిలాగానే ఈ చలికాలంలో అక్కడ వాయుకాలుష్యం బాగా పెరిగింది.


ప్రభుత్వం ఎంత చెప్తున్నా, జరిమానాలు విధిస్తున్నా ప్రజలు లెక్క చెయ్యలేదు. మార్కెట్లు కిటకిటలాడాయి. మాస్కులు లేవు, భౌతికదూరం లేదు. ఫలితంగా నవంబరులో మళ్లీ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. రోజుకి వంద మరణాలు నమోదవుతూ, క్రమంగా సంఖ్య హెచ్చుతున్నది. పరిస్థితి ఇలా విషమించడంలో అందరి తప్పు ఉంది. ఎవరికి వారు బాధ్యత పడాల్సిన సమయమిది. ఢిల్లీని చూసి మన పాలకులు సైతం జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది. గుంపుల్ని, ప్రజా సమూహాల్ని, వేడుకల్ని ప్రోత్సహించే సమయం కాదు. మాస్కు వినియోగం,భౌతికదూరం, చేతుల శుభ్రత పాటించి తీరాల్సిందే. పొంచి ఉన్న కరోనాని మన ఉదాసీనత తో పెంచి పోషించరాదు. కరోనాపై యుద్ధంలో మనమంతా ఇంకా యుద్ధరంగం మధ్యలోనే ఉన్నాం. సరైన ఆయుధం కూడా లేదు. మన అప్రమత్తత, బాధ్యతాయుత ప్రవర్తనే మనకు రక్ష.


డి.వి.జి.శంకరరావు 

Updated Date - 2020-11-21T05:46:48+05:30 IST