కరోనా భయంతో యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-08-12T21:19:09+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా భయంతో డిప్రెషన్కు లోనై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా భయంతో డిప్రెషన్కు లోనై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిలాస్ పేటకు చెందిన ఐశ్వర్యరాజుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతను హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నాడు. ఇప్పటికే అతడి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తీవ్ర మనోవ్యధకు లోనైన రాజు ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2018లో నూజివీడు ఐఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే కరోనా సోకింది.