ఇంట్లో నుంచి బయటికెళ్లిన యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2020-12-06T12:07:50+05:30 IST

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన యువతి

ఇంట్లో నుంచి బయటికెళ్లిన యువతి అదృశ్యం

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌ : ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుత్బుల్లాపూర్‌  రాఘవేంద్ర కాలనీకి చెందిన కుమార్‌ యాదవ్‌ కూతురు నంది (21) ఈ నెల 1న ఇంట్లో నుంచి సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులు వద్ద వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు శనివారం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-06T12:07:50+05:30 IST