నవ వధువు ఆత్మహత్య.. అత్తారింటిపై దాడి
ABN , First Publish Date - 2020-11-27T22:16:18+05:30 IST
వధువు కుటుంబ సభ్యులు.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పుట్టింటికి తీసుకెళ్లి దహనం చేశారు
చిత్తూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన నెలరోజులకే నవ వధువు చైతన్య ఆత్మహత్య చేసుకుంది. వధువు కుటుంబ సభ్యులు.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పుట్టింటికి తీసుకెళ్లి దహనం చేశారు. అత్తారింటిపై బాధిత కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఇల్లు ధ్వంసం చేశారు. కుప్పం మండలం ఉర్ల ఒబనపల్లి పంచాయతీ కూర్మాయిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తంగవేలు (24)తో చైతన్యకు అక్టోబర్ 28న వివాహమైంది.