మద్యం మత్తులో గొడవ...ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-03-13T13:37:42+05:30 IST

మద్యం మత్తులో గొడవ...ఒకరు మృతి

మద్యం మత్తులో గొడవ...ఒకరు మృతి

హైదరాబాద్: నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌పార్క్ హోటల్ వద్ద మోసిన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మోసిన్ అనే వ్యక్తిని అబ్బు కత్తితో గొంతుకోసి చంపేశాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అబ్బు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-03-13T13:37:42+05:30 IST