బ్యాంకు చోరీకి వెళ్లి.. గొంతు తెగడంతో దొంగ మృతి!
ABN , First Publish Date - 2020-08-11T04:43:04+05:30 IST
బ్యాంకు దొంగతనానికి వెళ్లాడో దొంగ. బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ తలుపులు కోయడం కోసం వెళ్తూ మరణించాడు.
అహ్మదాబాద్: బ్యాంకు దొంగతనానికి వెళ్లాడో దొంగ. బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ తలుపులు కోయడం కోసం వెళ్తూ మరణించాడు. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బ్యాంకుకు కన్నం వేయడానికి వెళ్లిన ఓ దొంగ స్ట్రాంగ్ రూమ్ తలుపులు బలవంతంగా తెరవాలని నిర్ణయించుకున్నాడు. అయితే స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లే దారి సన్నగా ఉండటంతో అతని చేతిలోని ఎలక్ట్రిక్ కట్టర్ పొరబాటున అతని మెడను తాకింది. దాంతో అతని గొంతు తెగి మరణించాడు. ఈ దొంగ మృతదేహాన్ని గమనించిన బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.