వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తల్లిని చంపేశాడు!
ABN , First Publish Date - 2020-12-28T12:01:27+05:30 IST
వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ ఆటో డ్రైవర్
![వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తల్లిని చంపేశాడు!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122806300540/12282020063116n13.jpg)
హైదరాబాద్/జీడిమెట్ల : వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ ఆటో డ్రైవర్ కన్న తల్లిని గొంతు పిసికి హత్య చేశాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ(40) కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఆమె కొంత కాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు ఆటో డ్రైవర్(24) ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో తల్లి మెడకు దుప్పటి చుట్టి గొంతు పిసికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.