దారుణం: మద్యం మత్తులో బిడ్డను చంపిన తండ్రి
ABN , First Publish Date - 2020-12-05T16:55:42+05:30 IST
అనంతపేటలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. ముక్కుపచ్చలారని
నిర్మల్: అనంతపేటలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారి నిత్యను తండ్రి వినీష్ నేలకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మద్యం మత్తులో తండ్రి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.