భార్యను చంపి..విమానంలో అత్తారింటికి వెళ్లి.. మామ ముందే దారుణంగా..

ABN , First Publish Date - 2020-06-23T22:24:25+05:30 IST

విడాకులు పొందే పరిస్థితుల్లో ఉన్న ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. అంతే కాకుండా అక్కడి నుంచి విమానంలో అత్తారింటికి వెళ్లి అత్తను కూడా హత్య చేశాడు.

భార్యను చంపి..విమానంలో అత్తారింటికి వెళ్లి.. మామ ముందే దారుణంగా..

బెంగళూరు: విడాకులు పొందే పరిస్థితుల్లో ఉన్న ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. అంతే కాకుండా అక్కడి నుంచి విమానంలో అత్తారింటికి వెళ్లి అత్తను కూడా హత్య చేశాడు. అనంతరం తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు అమిత్ అగర్వాల్‌ బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల కిత్రం అతడికి వివాహమైంది. అతడికి పదేళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. భార్యా బిడ్డలతో కలిసి అతడు బెంగళూరులోనే నివసిస్తుంటాడు. అతడి అత్తమామాల స్వస్థలం కోల్‌కతా.


అయితే కొంత కాలంగా అమిత్‌ దంపతుల మధ్య తీవ్ర పొరపొచ్చాలు వచ్చాయి. పరిస్థితి విడాకులు తీసుకునేంత వరకూ వెళ్లింది. ఈ క్రమంలో అతడు మంగళవారం నాడు విమానంలో అత్తారింటికి వెళ్లి మామయ్య ముందే అత్తను తుపాకీతో కాల్చి హత్యను చేశాడు. జరిగిన దారుణం చూసి భయపడిపోయిన మామాయ్య..ఫ్లాట్ బయటకు పారిపోయి..బయటనుంచి గడియపెట్టేశాడు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఇరుగు పొరుగు సహాయం కోరాడు. ఈలోపు అమిత్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


కాగా.. సమాచారం అదిన వెంటనే పోలీసులు ఘటనస్థాలానికి చేరుకున్నారు. వారు ఇంటిలోపలికెళ్లి చూస్తే..అత్త, అమిత్ ఇద్దరూ రక్తపుమడుగులో పడిఉన్నారు. అప్పటికే వారి ప్రాణాలు పోయినట్టు పోలీసులు గ్రహించారు.


మరోవైపు.. అమిత్ వద్ద వారికి ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో..తాను భార్యను కూడా హత్య చేశానని అమిత్ అంగీకరించాడు. దీంతో వారు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించగా..వైట్‌ఫీల్డ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ అతడి భార్య మృత దేహం పోలీసులకు లభించింది. దీంతో అమిత్ మామయ్యా సుభాష్ ధంధానియా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదృష్టవశాత్తూ.. అమిత్ కుమారుడు మాత్రం ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-06-23T22:24:25+05:30 IST