ఫ్లైఓవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-11-25T13:21:57+05:30 IST
ఫ్లైఓవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్కుమార్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. రామంతపూర్లోని ప్రింటింగ్ ప్రెస్లో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్ ఉదయం ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆత్మహత్యాయత్నాని పాల్పడ్డాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.