డాక్టర్‌పై రివెంజ్.. కరోనా మరణం గురించి ఇరుగుపొరుగుకు చెప్పాడని..

ABN , First Publish Date - 2020-06-23T23:37:49+05:30 IST

తండ్రి కరోనాతో మరణించిన విషయం డాక్టర్ ద్వారా ఇరుగు పొరుగుకు తెలిసిందని ఆరోపించిన ఓ వ్యక్తి సదరు వైద్యుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

డాక్టర్‌పై రివెంజ్.. కరోనా మరణం గురించి ఇరుగుపొరుగుకు చెప్పాడని..

న్యూఢిల్లీ: తండ్రి కరోనాతో మరణించిన విషయం డాక్టర్ ద్వారా ఇరుగు పొరుగుకు తెలిసిందని ఆరోపించిన ఓ వ్యక్తి సదరు వైద్యుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇనుప రాడ్లతో డాక్టర్‌పై దాడి చేశాడు. దేశరాజధానిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన కుటుంబ విషయాలు ఇరుగుపొరుగు వారితో పంచుకుని డాక్టర్ తన పరువు తీసేశాడని నిందితుడు ఆరోపించాడు. తన కుటుంబంలోకి కరోనా ప్రవేశించిందని ఇతరులకు చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పనికి పాల్పడ్డ డాక్టర్‌పై రివెంజ్ తీర్చుకునేందుకే దాడి చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే డాక్టర్ మాత్రం నిందితుడి ఆరోపణలను ఖండించాడు. కేవలం నిందితుడి బంధువలకు మాత్రమే అతడి తండ్రి కరోనాతో మరణించినట్టు చెప్పానని వైద్యుడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-06-23T23:37:49+05:30 IST