తాగుబోతును చావబాదిన పోలీసులు.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2020-05-25T03:39:34+05:30 IST
మద్యంతాగి అల్లరి చేసిన ఓ తాగుబోతును ఇద్దరు కానిస్టేబుళ్లు చావబాదారు.
ఛింద్వారా: మద్యంతాగి అల్లరి చేసిన ఓ తాగుబోతును ఇద్దరు కానిస్టేబుళ్లు చావబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛింద్వారాలో జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వీడియోలో కానిస్టేబుళ్లిద్దరూ తాగుబోతు తలపై కర్రలతో కొట్టినట్లు కనబడుతోంది. ఈ విషయం తెలిసిన పోలీసు శాఖ.. సదరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఛింద్వారా ఎస్పీ వివేక్ అగర్వాల్ వెల్లడించారు.