పెళ్లయిన ఐదు రోజులకే నవవధువు అదృశ్యం
ABN , First Publish Date - 2020-03-27T13:11:08+05:30 IST
వివాహం అయిన ఐదు రోజులకే ఓ నవవధువు అదృశ్యమైంది...
హైదరాబాద్/బర్కత్పుర : వివాహం అయిన ఐదు రోజులకే ఓ నవవధువు అదృశ్యమైంది. కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కామ్గార్ నగర్లో నివాసం ఉంటున్న సత్యనారాయణతో ఐశ్వర్య(20) ఈనెల 20న వివాహం అయ్యింది. ఉగాది సందర్భంగా నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి ఐశ్వర్య కిరాణాషాపునకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో గురువారం భర్త సత్యనారాయణ కాచిగూడ పీఎ్సలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.