ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2020-02-09T16:18:17+05:30 IST

నిజామాబాద్: ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతు

నిజామాబాద్: ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ వద్ద బోడ అవినాశ్(19) ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడిపోయి గల్లంతయ్యాడు. డిచ్‌పల్లి మండలం వెస్లీనగర్ మాతృతండాకు చెందిన అవినాశ్ కూలీ పని నిమిత్తం కాకతీయ కాలువ వద్దకు వచ్చాడు. పని అనంతరం కాళ్లూచేతులు కడుక్కోవడానికి కాలువలో దిగి అవినాశ్ గల్లంతయ్యాడు. 

Updated Date - 2020-02-09T16:18:17+05:30 IST