ఎయిర్టెల్, జియో బాటలో వొడాఫోన్.. రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్ విడుదల
ABN , First Publish Date - 2020-06-03T01:30:26+05:30 IST
ఎయిర్టెల్, జియో బాటలో వొడాఫోన్ కూడా రూ. 251తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇది డేటా ప్లాన్
న్యూఢిల్లీ: ఎయిర్టెల్, జియో బాటలోనే వొడాఫోన్ కూడా రూ. 251తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇది డేటా ప్లాన్ మాత్రమే. మరెటువంటి ప్రయోజనాలు ఇందులో లభించవు. రూ. 251 ప్లాన్లో 50 జీబీ డేటా లభిస్తుంది. కాలింగ్, మెసేజింగ్ ప్రయోజనాలు, టాక్టైం వంటివి లభించవు. కాలపరిమితి 28 రోజులు కాగా, ప్రస్తుతం ఉన్న ప్లాన్తో దీనికి సంబంధం ఉండదు. 28 రోజుల కాలపరిమితిలో మొత్తం 50 జీబీ డేటాను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
దీంతోపాటు వొడాఫోన్ తక్కువ డేటాతో మరిన్ని ప్యాక్లు ఆఫర్ చేస్తోంది. రూ. 48 ప్లాన్లో 3జీబీ డేటా లభిస్తుంది. కాలపరిమితి 28 రోజులు. రూ. 98 ప్లాన్లో 12 జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. అలాగే, రూ. 16 ప్లాన్లో 1జీబీ డేటాను అందిస్తుంది. దీని కాలపరిమితి 24 గంటలు మాత్రమే.