రూ.1,000 కోట్లు చెల్లించిన వొడా ఐడియా
ABN , First Publish Date - 2020-07-19T06:06:15+05:30 IST
వొడాఫోన్ ఐడియా.. ప్రభుత్వానికి మరో రూ.1,000 కోట్ల బకాయిలను చెల్లించింది. సర్దుబాటు స్థూల రాబడుల (ఏజీఆర్) విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి శనివారం నాడు టెలికాం శాఖ (డీఓటీ)కి ఈ చెల్లింపులు చేపట్టినట్లు...

న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా.. ప్రభుత్వానికి మరో రూ.1,000 కోట్ల బకాయిలను చెల్లించింది. సర్దుబాటు స్థూల రాబడుల (ఏజీఆర్) విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి శనివారం నాడు టెలికాం శాఖ (డీఓటీ)కి ఈ చెల్లింపులు చేపట్టినట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రూ.7,854 కోట్ల మేర ఏజీఆర్ బకాయిలు చెల్లించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. వొడాఫోన్ ఐడియా గతంలో మూడు దఫాలుగా రూ.6,854 కోట్లు చెల్లించింది. ఏజీఆర్ బకాయిల కింద టెలికాం కంపెనీలు రూ.1.6 లక్షల కోట్లు చెల్లించాలంటూ గత ఏడాది సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందులో వొడాఫోన్ ఐడియా వాటానే రూ.58,000 కోట్లుగా ఉంది.