భారత్తో మినీ ట్రేడ్ ఒప్పందమే బెస్ట్
ABN , First Publish Date - 2020-12-26T07:28:26+05:30 IST
భారత-అమెరికా మినీ ట్రేడ్ డీల్ వచ్చే నెలలో అధికారం చేపట్టనున్న బైడెన్ ప్రభుత్వ అగ్రప్రాధాన్యం కావాలని అమెరికా భారత వాణిజ్య మండలి (యూ ఎ్సఐబీసీ) సూచించింది...
![భారత్తో మినీ ట్రేడ్ ఒప్పందమే బెస్ట్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వాషింగ్టన్: భారత-అమెరికా మినీ ట్రేడ్ డీల్ వచ్చే నెలలో అధికారం చేపట్టనున్న బైడెన్ ప్రభుత్వ అగ్రప్రాధాన్యం కావాలని అమెరికా భారత వాణిజ్య మండలి (యూ ఎ్సఐబీసీ) సూచించింది. భారత, అమెరికా దేశాల బంధం పటిష్ఠంగా కొనసాగుతున్నదని, 2021లో ఈ బంధం మరింత విస్తరించేందుకు కీలక అవకాశాలు అందుబాటులోకి తెస్తుందని యూఎన్ఐబీసీ ప్రెసిడెంట్ నిశా దేశాయ్ బిస్వాల్ అన్నా రు. ఈ ఏడాది ట్రంప్ భారత పర్యటనతో ఉభయ దేశాల సంబంధాలు మరింత పటిష్ఠం అయినప్పటికీ యూఎస్, ఇండియా మినీ ట్రేడ్ డీల్ మాత్రం సాకారం కాలేదన్నారు. వాణిజ్య సంబంధాలకు అవరోధాలను తొలగించుకునేందుకు కూడా ఉభయ దేశాలు చిత్తశుద్ధితో ఉన్నట్టు ఆమె చెప్పారు.