ఎన్బీఎఫ్సీలకు ఊరట..
ABN , First Publish Date - 2020-04-18T08:04:08+05:30 IST
ఎన్బీఎఫ్సీల కోసం స్వల్ప మార్పులతో ఆర్బీఐ రూ.50,000 కోట్లతో ప్రత్యేక టీఎల్టీఆర్ఓ పథకం ప్రకటించింది. ఈ పథకం కింద నిధులు అందుకున్న
![ఎన్బీఎఫ్సీలకు ఊరట..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041802264232/04182020023340n11.jpg)
ఎన్బీఎఫ్సీల కోసం స్వల్ప మార్పులతో ఆర్బీఐ రూ.50,000 కోట్లతో ప్రత్యేక టీఎల్టీఆర్ఓ పథకం ప్రకటించింది. ఈ పథకం కింద నిధులు అందుకున్న బ్యాంకులు తప్పనిసరిగా ఆ నిధుల్లో కనీసం సగం నిధులను, నెల రోజుల్లో సరైన పరపతి రేటింగ్ లేని ఎన్బీఎ్ఫసీల రుణ పత్రాల్లో మదుపు చేయాలి. లేకపోతే మిగిలిన నిధులపై ఆర్బీఐ రెండు శాతం అదనపు వడ్డీ వసూలు చేస్తుంది. ఇది బ్యాంకులకు పెద్ద సంకట స్థితిగా మారనుంది. సరైన పరపతి రేటింగ్ లేని ఎన్బీఐఎఫ్సీలకు రుణాలు ఇస్తే.. అవి ఎన్పీఏలుగా మారే ప్రమాదం ఉంది. దీంతో బ్యాంకులు ఈ టీఎల్టీఆర్ఓ నిధుల కోసం పెద్దగా ఆసక్తి చూపక పోవచ్చని భావిస్తున్నారు.