డిజిటల్ లావాదేవీలను నిలిపివేయండి... హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఆర్బీఐ ఆదేశాలు
ABN , First Publish Date - 2020-12-04T01:01:19+05:30 IST
డిజిటల్ లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలనంటూ ప్రైవేటురంగ దిగ్గజ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్లో కిందటి నెలలో చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యను తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ క్రమంలో... హెచ్డీఎఫ్సీ నుంచి కొత్త క్రెడిట్ కార్డుల జారీకి బ్రేక్ పడింది.

ముంబై : డిజిటల్ లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలనంటూ ప్రైవేటురంగ దిగ్గజ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్లో కిందటి నెలలో చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యను తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ క్రమంలో... హెచ్డీఎఫ్సీ నుంచి కొత్త క్రెడిట్ కార్డుల జారీకి బ్రేక్ పడింది.
గత రెండేళ్లుగా హెచ్డీఎఫ్సీకి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో అంతరాయాలు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. నవంబరు 21 న బ్యాంకు ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో... ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.