నష్టాల నుంచి గట్టెక్కిన దేశీయ మార్కెట్లు...
ABN , First Publish Date - 2020-11-13T21:42:35+05:30 IST
భారత స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి గట్టెక్కాయి. ఫార్మా, మెటల్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో...
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి గట్టెక్కాయి. ఫార్మా, మెటల్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మళ్లీ పుంజుకుని స్వల్ప లాభాలు నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 29.20 పాయింట్లు బలపడి 12,720 వద్ద ముగియగా.. బీఎస్ఈ సెన్సెక్స్ 85.81 పాయింట్లు ఎగసి 43,443 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ తదితర షేర్లు 1 నుంచి 4 శాతం మేర లాభాలు నమోదు చేశాయి. ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం తదితర షేర్లు దాదాపు 2 శాతం మేర క్షీణించాయి.