ఓఎన్‌జీసీ చేతికి 7 క్షేత్రాలు

ABN , First Publish Date - 2020-10-23T06:18:29+05:30 IST

చమురు, సహజ వాయువు క్షేత్రాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ మొత్తం 7 క్షేత్రాలను గెలుచుకుంది...

ఓఎన్‌జీసీ చేతికి 7 క్షేత్రాలు

న్యూఢిల్లీ: చమురు, సహజ వాయువు క్షేత్రాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ మొత్తం 7 క్షేత్రాలను గెలుచుకుంది. చమురు, సహజ వాయువు నియంత్రణ సంస్థ డీజీహెచ్‌.. ఓపెన్‌ ఎకరేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ 5వ రౌండ్‌ కింద 12 క్షేత్రాలకు నిర్వహించిన బిడ్డింగ్‌లో ఓఎన్‌జీసీ 7 క్షేత్రాలను చేజిక్కించుకోగా ఆయిల్‌ ఇండియా 4 బ్లాక్స్‌ను దక్కించుకుంది. 

Updated Date - 2020-10-23T06:18:29+05:30 IST